శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.
మనదేశంలో ఆంగ్లేయుల ద్వారా ప్రచారం చేయబడిన భ్రమలలో ఇదొకటి. ఇందులో వాస్కోడగామా భారత్ రావడం మాత్రమే సత్యం. కాని ఆయన ఎలా వచ్చాడనేది తెలిసికొంటేనే మనకు సత్యం ఏమిటో తెలుస్తుంది.

సుప్రసిద్ధ పురాతత్వ వేత్త, పద్మశ్రీ డా. విష్ణు శ్రీధర వాకణ్‌కర్ ఇలా తెలిపినారు: "నేను నా పర్యటనలో భాగంగా ఒకసారి స్పెయిన్ వెళ్ళినాను. అక్కడ నాకు వాస్కోడగామా డైరీ లభించింది. దానిలో వాస్కోడగామా భారత్‌కు ఎలా వచ్చాడో వివరంగా ఉంది. అందులో ఆయనిలా వ్రాసినాడు: నా పడవ ఆఫ్రికాలోని జాంజిబారు తీరం చేరుకొన్నప్పుడు నా ఓడ కన్నా మూడురెట్లు పెద్దగా ఉన్న ఓడను అక్కడ నేను చూసినాను. ఒక ఆఫ్రికన్ దుబాసిని తీసికొని ఆ పెద్ద ఓడయొక్క యజమానిని కలిసినాను. ఆ యజమాని పేరు స్కందుడు - గుజరాతీ వ్యాపారి. భారతదేశం నుండి జాజి చెట్టు మరియు టేకు చెట్టు కలపను, మసాలా ద్రవ్యములు తీసికొని వచ్చాడు. వానికి బదులుగా ముత్యములు తీసికొని కొచ్చిన్ ఓడరేవుకు వచ్చి వ్యాపారం చేసేవాడు. వాస్కోడగామా స్కందుడను పేరు గల ఆ వ్యాపారిని కలుసుకొనుటకు వెళ్ళినపుడాతడు సాధారణ వేషంలో ఒక చిన్న మంచముపై కూర్చుండియున్నాడు. అతడు వాస్కోడగామాతో ఎక్కడికి వెళ్ళుచున్నారని అడిగినాడు. వాస్కోడగామా హిందూదేశం చూడటానికి వెళ్తున్నానన్నాడు. అప్పుడా వ్యాపారి నేనూ రేపు అటే వెళ్తున్నాను. నా వెనుక అనుసరించి రమ్మన్నాడు." ఆ విధంగా ఆ వ్యాపారి ఓడను అనుసరించి వచ్చి వాస్కోడగామా భారత్ చేరినాడు. ఈ సత్యం స్వతంత్ర భారతంలోనైనా మన నవతరానికి చెప్పవలసింది. కాని దురదృష్టవశాత్తు అలా జరగటం లేదు.

పై సంఘటన చదివిన పిమ్మట మన మనసులోనికి ఒక ఆలోచన తప్పక వస్తుంది. నౌకా నిర్మాణంలో ఇంత ఉన్నతస్థితిలోనున్న దేశంలో ఇప్పుడా విద్య ఎందుకు నశించిపోయింది? ఆంగ్లేయులు వచ్చిన పిదప వారిపాలనలో ఒక పథకం ప్రకారం కుట్రపన్ని నౌకానిర్మాణ పరిశ్రమను నాశనం చేసినారనే చారిత్రక సత్యాన్ని తప్పక తెలిసికోవాలి. ఈ చరిత్రను వివరిస్తూ ప్రఖ్యాత చరిత్రకారుడు శ్రీ గంగా శంకరమిశ్రా ఇలా వ్రాసినారు:

"అందరికన్న ముందున్న హిందువులు"

పాశ్చాత్యులు భారతదేశానికి రాకపోకలు సాగించినపుడు వారిక్కడి ఓడల్ని చూసి ఆశ్చర్యపోయినారు. 17 వ శతాబ్దం నాటివరకు కూడా ఐరోపావారి ఓడలు అధికాధికంగా ఆరువందల టన్నుల సామర్థ్యం మాత్రమే కలిగి ఉండేవి. కాని భారత్‌లో "గోఘా" పేరుగల పెద్ద ఓడలు 15 వందల టన్నుల సామర్థ్యం కలిగి ఉన్నట్లు ఐరోపావారు తెలిసికొన్నారు. ఐరోపా కంపెనీలు ఇలాంటి పెద్ద ఓడల్ని వినియోగించడం మొదలు పెట్టాయి. నైపుణ్యము గల హిందూదేశ కార్మికుల ద్వారా పెద్ద ఓడల్ని తయారుచేయించే పరిశ్రమల్ని అనేకం ప్రారంభించారు. 1811 సంవత్సరంలో లెఫ్టినెంటు వాకర్ ఇలా వ్రాసినాడు: బ్రిటిషువారి ఓడలన్నీ ప్రతి పన్నెండేళ్ళకు మరమ్మతుల పాలయ్యేవి. కాని భారతీయ ఓడలు టేకుకర్రతో చేయబడి 50 సంవత్సరాలకు పైగా ఎలాంటి మరమ్మతులు అవసరం లేకుండానే పనిచేసేవి. ఈస్టిండియా కంపెనీ వద్ద "దరియా దౌలత్" అనే పేరు గల ఒక ఓడ ఉండేది. అది 87 సంవత్సరాలపాటు మరమ్మతులు లేకుండా చక్కగా పనిచేసింది. భారతదేశంలో ఓడల నిర్మాణానికి సీసం కర్ర ( చండ్రచెట్టు కలప ), సాల వృక్షము కర్ర, టేకు కర్ర -- ఈ మూడు రకాల కలప వాడేవారు.

1811లో ఒక ఫ్రెంచి యాత్రికుడు వాల్ట్ జర్ సాల్విన్స్ "లే హిందూ" అనే పుస్తకం వ్రాసినాడు. "ప్రాచీన కాలం నుండి నౌకా నిర్మాణ కళలో హిందువులు చలా ఆరితేరియున్నారు. నేడు కూడా వారీ కళలో యూరపువారికి పాఠము చెప్పగల సమర్థులే. ఆంగ్లేయులు హిందువుల నుండి నౌకా నిర్మాణ కళను నేర్చుకొనుటకు చాలా ఉత్సాహం చూపేవారు. హిందువల వద్ద అనేక విషయాలు తెలుసుకొన్నారు. భారతీయ ఓడలలో సౌందర్యం, నాణ్యత కలగలసి ఉండేవి. ఈ ఓడలు హిందువుల యొక్క నిర్మాణ కౌశల్యానికి మరియు ధైర్యసాహసాలకూ ప్రతీకలుగా ఉన్నవి." ముంబాయిలోని పరిశ్రమలో 1736 నుండి 1863 వరకు 300 పెద్ద ఓడలు తయారైనవి. వీనిలో ఎక్కువ ఓడలను ఆంగ్లేయ నౌకాదళం "షాహీబేడే"లో చేర్చుకొన్నారు. వీనిలో "ఏషియా" అను పేరుగల ఓడ 2289 టన్నుల సామర్థ్యం కలది. దానిలో 84 ఫిరంగులు అమర్చబడి యుండెను. బెంగాలులోని హుగ్లీ, సిల్‌హట్, చట్టగాఁవ్, ఢాకా మొదలగు చోట్ల నౌకా నిర్మాణ పరిశ్రమలుండేవి. 1781 నుండి 1821 వరకు, 1,22,693 టన్నుల సామర్థ్యం గల 272 ఓడలు కేవలం ఒక హుగ్లీలోనే తయారైనవి.

ఆంగ్లేయుల కుటిలత్వము:

బ్రిటిషు ఓడలవ్యాపారులు భారతీయుల నౌకా నిర్మాణ కళా ఔన్నత్యాన్ని ఓర్వలేకపోయినారు. భారతీయ ఓడల్ని వాడవద్దని ఈస్టిండియా కంపెనీపై ఒత్తిడి తీసికొచ్చారు. ఈ విషయంలో అనేక విచారణలు కూడా జరిగినవి. 1811 లో కర్నల్ వాకర్ గణాంకాలతో సహా ఋజువు చేసినాడు. "భారతీయ ఓడలకు ఖర్చు తక్కువ, అవి చాలా బలంగా ఉంటాయి. బ్రిటిష్ నౌకాదళంలో కేవలం భారతీయ ఓడలనే వాడినచో చాలా పొదుపు అవుతుంది." బ్రిటిష్ నౌకానిర్మాణ కార్మికులు మరియు వ్యాపారులు ఉభయులలో ఈ మాట చాలా భయాందోళన్ కలిగించింది. డాక్టర్ టేలర్ అనునతడు ఇలా వ్రాసినాడు: "హిందూదేశపు సరకులతో నిండిన భారతీయ ఓడ లండన్ ఓడరేవు చేరుకొన్నపుడు ఆంగ్లేయ ఓడల వ్యాపారులు చాలా భయ కంపితులయ్యేవారు. థేమ్సునది ఒడ్డున శత్రువుల నౌకాదళపు ఓడల్ని చూసినపుడు కూడా అంతగా భయపడేవారు కాదు."

లండన్ ఓడరేవులో పనిచేసే కార్మికులు అందరికన్న ముందు ఆందోళనకు దిగినారు. "మన పనులన్నీ నష్టాల పాలవుతాయి. మా కుటుంబాలు పస్తులతో చస్తారు" అని గోల చేసినారు. ఈస్టిండియా కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఇలా వ్రాసినారు: "హిందూ దేశపు ఓడ పనివారలు ( కళాసీలు ) ఇక్కడికి వచ్చి మన సామాజిక స్థితిగతులను చూస్తారు. దానితో మనపై వారికున్న గౌరవం, భయభక్తులు పూర్తిగా మంటగలసి పోతాయి. వాళ్ళ దేశం వెళ్ళి మనలోని లోపాలను, లొసుగులను, మన బండారాన్ని బయటపెట్టి ప్రచారం చేస్తారు. దానితో ఆసియావాసులకు మన పట్ల ఉన్న ఆదరభావం నశిస్తుంది. ఈ ఆదరభావము, భయభక్తుల వలననే మనం ప్రభుత్వాన్ని నిలుపుకొని యుండగలిగినాము. ఇపుడది కాస్త లేకుండాపోతుంది. కావున దీని ప్రభావం మనకు చాలా హానికారకమవుతుంది." వెంటనే ఆంగ్ల పార్లమెంటు సర్ రాబర్ట్‌పీల్ అధ్యక్షతన దీనిపై ఒక కమిటీ వేసినారు.

నల్లచట్టము:

ఈ కమిటీ సభ్యులలో పరస్పరము -- అభిప్రాయభేదము లేర్పడినవి. అయినా పై రిపోర్టు ఆధారంగా ఒక చట్టమును 1814లో తెచ్చారు. దీని ప్రకారం భారతీయ కళాసీలకు బ్రిటిషు నావికులుగా పనిచేయు అర్హత లేదు. బ్రిటిషు ఓడలలో తక్కువలో తక్కువ 3/4 వంతు బ్రిటిషు కళాసీలను నియమించుట తప్పనిసరి. బ్రిటిషువారిని కాకుండా ఇతర దేశాలకు చెందిన యజమానుల ఓడలు లండన్ ఓడరేవులో ప్రవేశించే వీలులేదు. ఇంగ్లండులో తయారైన ఓడల ద్వారానే బయటిదేశాల సరకులు ఇంగ్లండుకు రావాలి." --- ఇలాంటి నల్లచట్టము అనేక కారణాల వలన మొదట అమలు కాకున్నను తర్వాత 1863 నుండి ఇది పూర్తిగా అమలు చేయబడినది. భారతదేశంలో కూడా ఇలాంటి నియమాలు గల నల్ల చట్టము తేబడినది. దీనివలన భారతదేశంలోని ప్రాచీన నౌకా నిర్మాణ కళ అంతరించిపోయినది. భారతీయ ఓడలపైన, సరకులపైన విధించిన పన్ను బాగా పెంచబడింది. ఇలా భారతీయ వ్యాపారుల్ని ఓడల్ని వ్యాపారం చేయకుండా వేరు చేయడం జరిగింది.

సర్ విలియం డిగ్వీ అనునతడు ఇలా చాలా చక్కగా చెప్పినాడు: "పాశ్చాత్య ప్రపంచపు రాణి ( బ్రిటిషురాణి ) ప్రాచ్య సాగర రాణిని ఇలా వధించివేసింది" భారతీయ నౌకా నిర్మాణ కళ ముగిసిపోయిన తీరును తెలియజెప్పే సంక్షిప్త ఇతిహాసమిదే!"

మూలం: భారతీయ ఉజ్వల వైజ్ఞానికి పరంపర.
రచయిత: సురేశ్ సోని, తెలుగు అనువాదం: బెల్లంకొండ మల్లారెడ్డి.
నవయుగ భారతి ప్రచురణలు.

11 comments

  1. ఆంగ్లేయుల వల్ల ఇది కూడా నాశనమయ్యిందా?

     
  2. Anonymous Says:
  3. ఆ ఇది కూడానా అంటారేమిటండి, ఏమి పోలేదని. అహ్హహ్హ్హ

     
  4. నేను చదివింది ఈ పుస్తకమేనో కాదో గుర్తు లేదు కాని ఈ విషయాలు ఇంతకుముందు చదివాను. లోగుట్టు పెరుమాళ్ళకెరుక

     
  5. invention కు Discovery కి తేడా ఉందిలేబాసూ...అతడు గుజరాతీ పైలెటా వేరొకడా అనేదాని మీద ఇంతవరకూ ఖచ్చితమైన ఆధారాలు లేవు. కానీ మీరు మాత్రం తేల్చేశారు...ఏపరిస్థితుల్లో సముద్రమార్గం కనుక్కోవలసి వచ్చిందో ఆ చరిత్ర మీకు నిజంగా తెలుసా!

     
  6. ఇదే మొదటిసారి నేనీ విషయం వినడం. కానీ నమ్మడానికి కష్టం అని పించడం లేదు.. వర్తమానంలో జరుగుతున్నవి చూస్తో ఉంటే. కానీ మీరు హిందువులు (భారతీయులు అన్న భావంతో ఉపయోగించబడినా కూడా)వెధవాయిలు, దుష్టులూ ఏరకమైన ప్రతిభాపాటవాలూ లేనివారు అని రాసి ఉన్న ఏదైనా పుస్తకంలోంచి ఉటంకించి ఉంటే మిమ్మల్ని ఎవరూ ప్రశ్నించరు.

     
  7. Anonymous Says:
  8. మనకు తెలియని సత్యాలు ఏన్నో చరిత్రలో దాగున్నాయి. విమానాల జ్ఞానం మందే. అంత పెద్ద తాజమహల్ నిర్మిచినవాల్లు పెద్ద వోడలు నిర్మించారంటంలొ ఆశ్చర్యం లేదుకదా

     
  9. చరిత్ర? ఎవరిది? ఆ దిక్కుమాలిన రోమిలా థాపర్ దా? లేక మనదేశం గురించి ఏమి గొప్పగా వ్రాసినా కుళ్ళుకునే ఆమె అభిమానులదా?

     
  10. Anonymous Says:
  11. సచిన్ భారతరత్నా !?: హవ్వ
    ఏంటొ ఈ మధ్య ఈనాడు సచిన్ ను ఆకాసానికెత్తేస్తుంది భారతరత్న అనీ పలానా రత్న అనీ. దానికి ఊతంగా వివిధ ప్రముఖుల చేత ప్రకతనలు ఇప్పిస్తింది . ఇదంతా చూస్తుంటే సచిన్ కు భారతరత్న ఇవ్వడానికి రంగం సిద్దం చేసుకున్నట్లుంది . దానికి గానూ మీడియా జనాలను మానసికంగా సిద్దం చేస్తున్నట్లుంది . ఈ రోజు ఈనాడులో థాకరే ఏమన్నాడో తెలుసా? సచిన్ భారతరత్నమట ఆయనను మించిన రత్నాలు ఈ దేశంలో లేవట , అలాంటి రత్నాలు మహారాష్ట్రలోనే పుడతాయట .ఇక్కడ నేనేదో ప్రాంతీయాభిమానం రెచ్చగొడుతున్నానని అనుకోవద్దు ఎక్కడ పుట్టినా వాళ్ళు కూడా భారతీయులే కదా ! ఇక్కడ విషయం అదికాదు . గత కొద్ది కాలంగా (2001 నుండి ) భారతరత్న ప్రధానం జరగడం లేదు . అయితే మధ్యలో (2008) భీంసెన్ జోషి కి ప్రధానం జరిగింది . ఈ సంఘటనను మినహాయిస్తే దాదాపు తొమ్మిదేళ్ళుగా అవార్డు ప్రధానం జరగడం లేదు. అంటె ఆ అవార్డు పొందడానికి తగిన అర్హులు లేరు ఇప్పుడు సచ్చిన్ అనే క్రిడాకారుడు తన రికార్డులతో దేశం పరువును దిగంతాలకు వ్యాపింపజేస్తున్నాడట అందుకని భారతరత్న ను ఆయనకివ్వాలని కొంతమంది (microscopic minorities) డిమాండ్. గత అవార్డు గ్రహీతల ప్రతిభాపాటవాలను పరిశీలిస్తే వారి ప్రతిభ ( వ్యక్తిగత లేదా ప్రొఫెషనల్ ) ఈ దేశానికి ఏదొవిధంగా ఉపయోగపడింది. ఉదాహరణకు లతా మంగేష్కర్ నే తీసుకుంటే భారత - చైనా యుద్ద సమయంలో జవహర్ లాల్ నెహ్రు సమక్షంలో Ae Mere Watan Ke Logon ( " Oh, The People Of My Country ) అనే పాట పాడి వేలాది భారత సైనికులను ఉత్తేజ పరిచారు ఆ ఉత్తెజం తోనే వారు ఆ యుద్దంలో పాల్గొన్నారు ( ఆ యుద్దంలో భారత్ ఓటమి చెందడం వేరే సంగతి ). మరి సచిన్ సాధించిన ఆయన వ్యక్తిగత రికార్డులు ఈ దేశానికి ఏ విధంగా ఉపయోగపడతాయో ఆయనే చెప్పాలి. కనీసం తన ప్రతిభతో ఈ దేశానికి ప్రపంచ కప్ కూడా సాధించి పెట్టలేకపోయారు . బహుశా ఆయనకు ప్రపంచ కప్ కంటే వ్యక్తిగత రికార్డులే ముఖ్యం కావచ్చు. కప్ సాధిస్తే ఆ క్రెడిట్ జట్టు అందరికీ చెందుంతుది మరి వ్యక్తిగత రికార్డులు అలా కాదు కదా ! ఎప్పటికీ ఆయన పేరు మీదనే ఉంటాయి. మరి అలాంటి వ్యక్తికి అవార్డు ఇవ్వాలనడం ఏం సమంజసం ? ఇంత కంటె గొప్ప్ వాళ్ళు ఎంతమంది లేరు ! భారతదేశంలో హరిత విప్లవానికి ( Green Revolution ) ఆద్యుడైన M, S. స్వామినాధన్ ను అందరూ మరిచిపొయారు. దేశాన్ని ఆహార ధాన్యాల కొరత నుండి కాపాడిన స్వామినాధంకు దక్కింది ఒక్క వ్యవసాయ కమిషన్ చైర్మన్ పదవి . హరిత విప్లవం మూలంగానే దేశంలో వరి, గోధుమల దిగుబడి గణనీయంగా పెరిగాయి . 1961 లో ఆయన నార్మన్ బోర్లాగ్ ను దేశానికి ఆహ్వానించకపోయినట్టైతే పరిస్తితి వేరే రకంగా ఉండేది . ఇక పోతె వర్గీస్ కురియన్ సంగతి ... ఈయన్ White Revolution కి ఆద్యుడు . ఆపరేషన్ ఫ్లడ్ పేరుతో గ్రామీన ప్రాంతాలలో కోపరేటివ్ సొసైటీలను స్తాపించి పాల విప్లవానికి నాంది పలికాడు. తద్వారా గ్రామీణ భారతాన్ని ఆర్ధిక పరిపుష్టం చెసాడు. ఇక మూడవ వ్యక్తి పి.వి. నరసిం హా రావు . ఈయన సంగతి అందరికీ తెలిసిందే . మరి ఇంతమందిని వదిలేసి సచిన్ కు భారతరత్న ఇవ్వడంలో ఏ లాబీయింగ్ పనిచేస్తుందో అర్ధం కావడం లేదు

     
  12. Anonymous Says:
  13. ayya katti mahesh garu miru innallu hindumatanne thidatharu anukonna kani ippude telisindi baratadesaniki sambanchina elanti goppa vishayanni miru angikarincharu ani

     
  14. Regarding sachin vs bharatratna

    http://www.facebook.com/photo.php?fbid=2904115355282&set=a.2289066819453.126636.1032423490&type=3&theater

     
  15. Regarding innovations & achievements of BHARATIYAs

    http://www.facebook.com/photo.php?fbid=2582475754493&set=a.2160209478100.121471.1032423490&type=3&theater

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts