1890 లలో గిబ్స్ యొక్క ఘనతని గుర్తించిన వాడు ఓస్వాల్డ్
ఒక్కడే కాడు. డచ్ భౌతిక రసాయన శాస్త్రవేత్త హెండ్రిక్ విలెమ్ బఖ్వి రోజెబూమ్
(1854-1907) యూరప్ అంతటా గిబ్స్ ‘దశా నియమాన్ని’
(phase rule) బాగా ప్రచారం చేశాడు.
అలాగే 1899 లో
ఫ్రాన్స్ కి చెందిన హెన్రీ లూయీ ల షాట్లియే (1850-1936) గిబ్స్ పరిశోధనలని ఫ్రెంచ్ లోకి అనువదించాడు. భౌతిక
రసాయన శాస్త్రవేత్త అయిన ‘ల షాట్లియే’ (Le Chatlier) పేరు మనకి ఇప్పుడు అతడి పేరుతో ఉన్న ‘ల షాట్లియే
సూత్రం’ వల్ల తెలుసు. 1888 ఇతగాడు ప్రతిపాదించిన సూత్రానికి ‘ల షాట్లియే...

p విలువ ఒక వృత్తం యొక్క చుట్టుకొలతకి,
వ్యాసానికి మధ్య నిష్పత్తితో సమానం అని చిన్నతరగతులలోనే పిల్లలు నేర్చుకుంటారు. అయితే
p విలువ
22/7 ని పిల్లలకి నేర్పుతారు. ఇది కేవలం ఉజ్జాయింపు
మాత్రమే. నిజానికి అదో ‘అకరణీయ సంఖ్య’ (irrational number). ఇంకా కచ్చితంగా చెప్పాలంటే అది అకరణీయ సంఖ్యలలో
ఉపజాతి అయిన అతీత సంఖ్య (transcendental number).
దాన్ని రెండు పూర్ణ సంఖ్యల నిష్పత్తిగా
వ్యక్తం చెయ్యడానికి వీలుపడదు. కాని అనంత...

ఓస్వాల్డ్ తన
వ్యాఖ్యానంలో ఉత్ప్రేరణ విషయంలో గిబ్స్ సిద్ధాంతాలని
చర్చించాడు. పదార్థాల మధ్య శక్తిపరమైన సంబంధాలని మార్చకుండా, ఉత్ప్రేరకాలు చర్యలని
వేగవంతం చేస్తాయని వాదించాడు. చర్యలో పాల్గొనే రసాయనంతో ఉత్ప్రేరకం కలిసి ఒక మధ్యగత
పదార్థాన్ని ఏర్పరుస్తుంది. ఆ మధ్యగత పదార్థం మళ్లీ విచ్ఛిన్నమై ఆఖరులో రావలసిన ఉత్పత్తులని విడుదల చేస్తుంది. ఆ కారణం చేత ఉత్ప్రేరకం మాత్రం మొదట్లో ఉన్న స్థితికి
వచ్చేస్తుంది.
ఉత్ప్రేరకం
పని...
రామానుజన్ హార్డీ ల మధ్య
సహాధ్యాయం మొదలయ్యింది. అంతవరకు రామానుజన్ పంపిన ఉత్తరాలలోని గణిత విషయాల గురించి హార్డీకి
వేల సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేసుకొవాలంటే అంతవరకు దూరం అడ్డొచ్చింది. కాని
ఆ విచిత్ర సిద్ధాంతాల ఆవిష్కారకుడు పక్కనే ఉన్నాడు. ఏం సందేహం వచ్చినా వెంటనే అడిగి
తేల్చుకోవచ్చు. రామానుజన్ నోట్సు పుస్తకాల అధ్యయనం మొదలెట్టాడు హార్డీ.
రామనుజన్ పంపిన 120 సిద్ధాంతాలలో చాలా మటుకు ఈ నోట్సు పుస్తకాలలోనే
ఉన్నాయి. ఐదవ అధ్యాయంలో రామానుజన్ రాసిన మొదటి వ్యాసంలో వర్ణింపబడ్డ బెర్నూలీ సంఖ్యల
ప్రస్తావన వచ్చింది. అధ్యాయం...

పదార్థం యొక్క
వివిధ దశల (phases of matter) (ఘన, ద్రవ,
వాయు దశలు) మధ్య ఉండే సమతాస్థితులకి గిబ్స్ ఉష్ణగతి శాస్త్ర ధర్మాలని వర్తింపజేస్తూ
పోయాడు. నీరు, నీటి ఆవిరి కొన్ని ఉష్ణోగ్రతల వద్ద, పీడనాల (pressures) వద్ద కలసి ఉండగలవు. ఉష్ణోగ్రత మారితే, సమతాస్థితిని
నిలుపుకునేందుకు గాను, తదనుగుణంగా పీడనంలో కూడా మార్పు రావాలి. కాని ద్రవ నీరు, నీటి
ఆవిరి, మంచు గడ్డ – ఈ మూడు దశలు కలిసి ఉండడం అనేది ఒక ప్రత్యేక ఉష్ణోగ్రత, పీడనం...
మొదటి రెండు రోజులు ఓడ ప్రయాణం
రామానుజన్ కి అంత సుఖమయంగా సాగలేదు. ఎత్తిపడేసే కెరటాల కుదుపుకి రామానుజన్ కి కడుపులో
తిప్పినట్టు అయ్యేది. రెండు రోజుల ప్రయాణం తరువాత ఓడ కొలొంబో దాటింది. ఇక అక్కణ్ణుంచి
విశాలమైన అరేబియన్ సముద్రాన్ని దాటాలి. ఇండియాకి యూరప్ కి మధ్య సముద్ర మార్గాలకి సుదీర్ఘమైన
చరిత్ర వుంది. యూరప్ నుండి ఇండియాకి సముద్ర మార్గాన్ని కనుక్కున్న వాస్కో ద గామా ఆఫ్రికా
చుట్టూ తిరిగి, కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా కేరళ చేరుకున్నాడు. కాని 1869 లో సూయెజ్ కాలువ నిర్మాణం తరువాత ఇండియాకి యూరప్
కి మధ్య దూరం బాగా తరిగిపోయింది. అరేబియన్...
postlink