అధ్యాయం 2
పరుసవేదం
పరుసవేదం
అలెగ్జాండ్రియా
అరిస్టాటిల్ కాలంలోనే మాసెడాన్ ని (ఇది గ్రీస్ కి ఉత్తరాన ఉన్న ఓ రాజ్యం) ఏలే అలెగ్జాండర్ చక్రవర్తి విశాలమైన పర్షియా సామ్రాజ్యాన్ని జ

అలెగ్జాండర్ కింద పని చేసిన సేనాపతులలో ఒకడైన టోలెమీ ఈజిప్ట్ లో ఓ కొత్త రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యానికి అలెగ్జాండ్రియా నగరం రాజధాని అయ్యింది. అలెగ్జాండర్ స్థాపించిన ఈ నగరానికి ఆ చక్రవర్తి పేరే పెట్టారు. అలెగ్జాండ్రియాలో టోలెమీ, ఇంకా అతడి కొడుకైన టోలెమీ II, జ్ఞాన దేవతలైన మ్యూస్ (Muses) ల కోసం ఓ ఆలయాన్ని నిర్మించారు. మ్యూస్ దేవతల ఆలయం కనుకనే దాన్ని మ్యూసియమ్ (Museum) అన్నారు. వర్తమాన ప్రపంచంలో ఓ పరిశోధనా కేంద్రానికో, ఓ విశ్వవిద్యాలయానికో ఎలాంటి స్థానం ఉంటుందో ఆ రోజుల్లో ఆ మ్యూసియమ్ కి అలాంటి స్థానమే ఉండేది. ఆ మ్యూసియమ్ తో పాటు ప్రాచీన లోకంలో కెల్లా అతి పెద్దదైన ఓ గొప్ప గ్రంథాలయాన్ని కూడా నిర్మించారు.
ఆ విధంగా ఒక పక్క ఈజిప్షియన్లకి సాంప్రదాయ బద్ధంగా వస్తున్న ఆచరణాత్మక రసాయనిక విజ్ఞానం, మరో పక్క గ్రీకు సాంప్రదాయం నుండి వచ్చిన సైద్ధాంతిక విజ్ఞానం రెండూ చేతులు కలిపాయి. అయితే అలాంటి సంగమం వల్ల పూర్తిగా మంచే జరిగిందని చెప్పడానికి లేదు. ఈజిప్షియన్లు తమకి తెలిసిన రసాయన విద్యని ప్రత్యేకించి చనిపోయిన వారి దేహా

అంతకు పూర్వం అయోనియాకి చెందిన తాత్వికులు మతాన్ని, విజ్ఞానాన్ని వేరు వేరుగా ఉంచారు. రెండూ కలియని దిక్కులుగా ఉండేవి. కాని ఈజిప్ట్ లో జరిగిన ఈ కొత్త మత, విజ్ఞానాల సంగమం వల్ల జ్ఞానం యొక్క పురోగతి మందగించింది.
(సశేషం...)
0 comments