
http://www.andhrabhoomi.net/sisindri/old-story-923ఇలా ఉండగా ఏమీ తోచని పాలోకి తన ఓడ పక్కనుండి ఓ పెద్ద తిమింగిలం పోవడం కనిపించింది. నేలజంతువులు అన్నిట్లోకి సింహం వేటలో ఎంతో ఉత్సాహం, ఉద్వేగం ఉన్నట్టుగానే, సముద్ర చరాలు అన్నిట్లోకి తిమింగలాలని వేటాడే అవకాశం కోసం నావికులు ఉర్రూతలూగేవారు. హార్పూన్ అనబడే బలమైన ఈటె తీసుకుని దాని మీదకి విసిరాడు పాలో. ఈటె గుచ్చుకోగానే తిమింగిలం విలవిలలాడింది. నీట్లో సంక్షోభంగా కొట్టుకోవడం మొదలెట్టింది. ఈటె యొక్క అవతలి...

http://www.andhrabhoomi.net/intelligent/darwin-story-620పాలే రచనలు కాకుండా మరి కొన్ని పుస్తకాలు కూడా డార్విన్ చదువుకునే రోజుల్లో అతడి మీద గాఢమైన ప్రభావం చూపాయి. వాటిలో ఒకటి అలెగ్జాండర్ హంబోల్ట్ రాసిన ‘Personal Narrative‘ (నా జీవనయాత్ర). జర్మనీకి చెందిన అలెగ్జాండర్ హంబోల్ట్ (1769 – 1859) ఓ గొప్ప ప్రకృతి శాస్త్రవేత్త, పర్యాటకుడు. హంబోల్ట్ తన జీవితంలో విస్తృతంగా పర్యటించాడు. ఆ పర్యటనలలో తన చుట్టూ ఉండే పరిసరాలని క్షుణ్ణంగా పరిశీలించేవాడు. భౌగోళిక...
http://www.andhrabhoomi.net/sisindri/m-991నౌకాదళం ఆఫ్రికా పశ్చిమ తీరం వెంట దక్షిణ దిశగా యత్ర కొనసాగించింది. మైళ్ల తరబడి తీరరేఖని దాటుకుంటూ ఓడలు ముందుకు సాగిపోయాయి. ఇక తదుపతి మజిలీ కేప్ వెర్దే దీవులు. దీవులు చేరగానే తీరం మీదకు వెళ్లి పెద్ద ఎత్తున వంటచెరకు, మంచినీరు, కూరలు, పళ్లు ఓడలకి తరలించమని కొంతమందిని పంపించాడు వాస్కో ద గామా. ఈ ఆదేశం నావికులకి కాస్త ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఆఫ్రికా తీరం వెంట ప్రయాణం ఒక విధంగా చూస్తే పెద్ద కష్టం కాదు. ఎప్పుడూ తీరం కనిపించేలా కాస్తంత దూరంలో ఉంటూ యాత్ర కొనసాగిస్తే ఆహారం మొదలైన సరుకులు...

http://www.andhrabhoomi.net/more/intelligentచార్లెస్ డార్విన్ ఇంగ్లడ్ లో ష్రూబెరీ నగరంలో 1809 లో, ఫిబ్రవరి 12, నాడు పుట్టాడు. తండ్రి పేరు రాబర్ట్ డార్విన్, తల్లి సుసన్నా డార్విన్. చార్లెస్ తండ్రి మంచి ఆస్తిపరుడైన వైద్యుడు. తాత ఎరాస్మస్ డార్విన్ కూడా వైద్యుడే. ఒక జీవశాస్త్రవేత్తగా కూడా అతడికి మంచి పేరు ఉండేది. తల్లి సుసన్నా పుట్టింటివైపు ఇంటిపేరు వెడ్జ్ వుడ్. ఆమె తండ్రి జోసయా వెడ్జ్ వుడ్ ఓ పేరుమోసిన కుమ్మరి.చార్లెస్ తాతలు (ఎరాస్మస్ డార్విన్,...

http://www.andhrabhoomi.net/sisindri/o-086ఇండియా యాత్రకి సన్నాహాలు పూర్తయ్యాయి. ఎప్పుడెప్పుడు బయల్దేరుదామా అని నావికులంతా తహతహలాడుతున్నారు. రాజుగారి ఆనతి కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఆ సందర్భంగా మాంటెమో ఓ నోరో అనే ఊళ్లో రాజుగారు విందు ఏర్పాటు చేశారు. వేడుకలో పాల్గొనడానికి ఎంతో మంది ప్రభుత్వ అధికారులు, చర్చిఅధికారులు, సంఘంలో గొప్ప పరపతి గల వారు ఎంతో మంది విచ్చేశారు. “అసమాన నావికుడు, విశ్వాసపూరితుడైన ప్రభుత్వ సేవకుడు అయిన వాస్కో ద గామాని...

ఆకాశం నీలంగా ఎందుకు ఉంటుంది?- స్వాతి చీమకుర్తిఎండగా ఉన్న రోజు పైకి చూస్తే మనకి ఆకాశం నీలం రంగులో కనిపిస్తుంది. సూర్యాస్తమయం అయ్యేసరికి ఆకాశం రంగు ఎరుపుగానో, లేక నారింజ రంగులోనో కనిపిస్తుంది. ఆకాశం నీలం రంగులో ఎందుకు కనిపిస్తుంది? సూర్యుడు అస్తమించే సమయం లో ఎరుపు రంగు ఎలా వస్తుంది? ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలంటే మనం ముందుగా కాంతి గురించి, వాతావరణం గురించి తెలుసుకోవాలి.వాతావరణం:భూమి చుట్టూ ఉండే వాతావరణం, వాయు అణువులతోను, ఇతర పదార్థాలతో...

http://www.andhrabhoomi.net/intelligent/srer-757ఆ విధంగా ప్రతిభతో కూడిన రూపకల్పన వల్లనే జీవజాతులు సృజించబడ్డాయి అన్న భావనని అడ్డుపెట్టుకుని సృష్టి వాదులు సంబరపడుతున్న సమయంలో, వారి వేడిని చల్లారుస్తూ, పరిణామ వాదానికి మద్దతు నిస్తూ మరిన్ని ఆధారాలు బయటపడ్డాయి.ఎన్నో జంతువులకి పనికిరాని అంగాలు ఉంటాయి. ఉదాహరణకి కొన్ని పాములకి కాళ్ళు ఉంటాయి. పాకే పాములకి కాళ్లతో ఏం పని? బల్లులకి, మొసళ్లకి ఉన్నట్టే ఉంటాయి గాని నిజానికి ఆ కాళ్లు ఆ పాముల కదలికలో...

http://www.andhrabhoomi.net/sisindri/vasco-da-gama-359సేతుబల్ లో వాస్కో ద గామా సాధించుకు వచ్చిన ఘన విజయం చూశాక బేజా ప్రాంతానికి డ్యూక్ అయిన డామ్ మిగ్యుయెల్ కి వాస్కో సామర్థ్యం మీద నమ్మకం బలపడింది. ఇండియాకి దారి కనుక్కోగల సత్తా ఈ వ్యక్తిలో ఉందని మనసులో అనుకున్నాడు. ఇండియాకి నౌకాదళాన్ని పంపితే దాన్ని శాసించగల సమర్ధుడు ఈ వాస్కో ఒక్కడే అంటూ వాస్కోని సిఫారసు చేస్తూ రాజైన జాన్-2 కి డామ్ మిగ్యుయెల్ జాబు రాశాడు. ఆ సిఫారసుని రాజు ఆమోదించాడు. ఇండియాకి...

http://www.andhrabhoomi.net/intelligent/wrere-375గతంలో ప్రళయం ఒకే సారి వచ్చి ఉంటే శీలాజాలన్నీ ఒకే లోతులో దొరికి ఉండాలి. కాని శీలాజాలు ఎన్నో లోతుల్లో విస్తరించి ఉండడం మతఛాందస వాదులని ఇబ్బంది పెట్టింది. ఆ సమస్య నుండి తప్పించుకోడానికి ప్రళయం ఒకే సారి రాలేదని, గతంలో ఎన్నో సార్లు వచ్చిందని ఓ కొత్త ప్రతిపాదన లేవదీశారు. కాని శిలాజాలు చెప్పే సాక్షాలని మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తూ పోతే మరో ముఖ్యమైన విషయం బయటపడింది. వివిధ లోతుల్లో దొరికిన శిలాజాలన్నీ...

(గాంధీ జయంతి సందర్భంగా ఇవాల్టి నుండి ఓ కొత్త సీరియల్. కొలంబస్ కథ ముగిసింది కనుక దానికి కొనసాగింపుగా ఇటీవలే ఆంధ్రభూమిలో వాస్కో ద గామా మీద మొదలైన సీరియల్...)http://www.andhrabhoomi.net/sisindri/lokam-chuttina-veerudu-921అసమాన సాహసాన్ని ప్రదర్శిస్తూ కొలంబస్ నాలుగు గొప్ప యాత్రలు చేసి, ఇండియాకి దారి కనుక్కోలేకపోయినా, పశ్చిమ ఇండీస్ దీవులని, దక్షిణ అమెరికా ఖండాన్ని కనుక్కున్నాడు. కాని చివరి వరకు తను కనుక్కున్న ప్రాంతం ఇండియానే అన్న భ్రమలో ఉన్నాడు....
postlink